Tuesday, September 17, 2024
HomeతెలంగాణRevanth: పాతబస్తీ మెట్రోరైలు శంకుస్థాపన

Revanth: పాతబస్తీ మెట్రోరైలు శంకుస్థాపన

ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా టైంలో అభివృద్ధిపైనే మా దృష్టి

కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు నగర అభివృద్ధికి కృషి చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి పాతబస్తీలో మెట్రో రైలు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికే మేం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళుతున్నామని రేవంత్ స్పష్టంచేశారు.

- Advertisement -

ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ..

ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు.. మిగతా సమయంలో అభివృద్ధిపైనే మా దృష్టి అన్న రేవంత్, ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అంటూ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఒరిజినల్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మేం కృషి చేస్తున్నామన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే లండన్ థెమ్స్ నగరాన్ని అక్బరుద్దీన్ తో కలిసి సందర్శించామన్న రేవంత్, పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫెజ్-2 ను తీసుకొస్తున్నామని వెల్లడించారు.

ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణ చేయనున్నామని, చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. చంచల్ గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తామని, హైదరాబాద్ సిటీలో ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత మాదన్నారు. మైనారిటీల కోసం 4 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ దేనని రేవంత్ చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..

ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. గండిపేట నుంచి నగరంలోని 55 కి.మీ ల పరిధిలో మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News