Thursday, September 19, 2024
HomeతెలంగాణCollector Tripathi: ఈనెల 2, 3 వ తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్...

Collector Tripathi: ఈనెల 2, 3 వ తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు

18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి

18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని, ఈ నెల రెండు మూడో తేదీలలో ప్రతి పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక క్యాంప్ నిర్వహించే సమయంలో సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని, ప్రజలు ప్రత్యేక క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో ఓటరుగా ఉండి ప్రస్తుత ఓటర్ జాబితాలో పేరు లేని పక్షంలో ఫారం 6 నింపి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, ఓటరు వివరాలలో సవరణలు అవసరమైతే ఫారం 8 నింపి సవరణలు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News