Sunday, July 7, 2024
HomeతెలంగాణErrabelli: కేసీఆర్, కేటీఆర్ చొరవతోనే పారిశ్రామికాభివృద్ధి

Errabelli: కేసీఆర్, కేటీఆర్ చొరవతోనే పారిశ్రామికాభివృద్ధి

కెసిఆర్ ఆశీర్వాదం,, మంత్రి కేటీఆర్ కృషితోనే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి సాధ్యమైంది

తెలంగాణ రాష్ట్ర వేడుకలలో భాగంగా హనుమకొండ జిల్లా మడికొండ పారిశ్రామిక కేంద్రం అవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మంత్రి జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన పారిశ్రామిక ప్రగతిని వివరించారు. ఐటీ రంగంలో కెసిఆర్ ఆశీర్వాదంతో, మంత్రి కేటీఆర్ కృషితో సాధించిన ప్రగతి, వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మంత్రి వివరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కుడా చైర్మన్ సుందర్ రాజు, హనుమకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత కార్పొరేటర్, సంబంధిత అధికారులు పారిశ్రామిక కేంద్రంలో పని చేసే కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News