Monday, November 17, 2025
HomeతెలంగాణErrabelli: కల్లు రుచి చూసిన మంత్రి ఎర్రబెల్లి

Errabelli: కల్లు రుచి చూసిన మంత్రి ఎర్రబెల్లి

పథకాలు అందుతున్నాయా అంటూ గీతకారులను అడిగిన మంత్రి

రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తుండగా మార్గ మధ్యంలో బురాన్ పల్లి వద్ద ఒక గీత కార్మికుడు కల్లు తీస్తున్న విషయం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గమనించారు. వెంటనే వారి వాహనాన్ని అపగా, అవాక్కయిన ఆ గీత కార్మికుడు మంత్రి గారి మీద అభిమానంతో కల్లు తాగమని అడుగగా మంత్రి ఎర్రబెల్లి రుచి చూశారు.

- Advertisement -

ఈ సందర్భంగా పిల్లలు ఏమి చేస్తున్నారు?… సీఎం కెసిఆర్ గారు గీత కార్మికులకు అందిస్తున్న పథకాలు అమలు అవుతున్నాయా….? అని ఆ కార్మికుడితో కొద్దిసేపు ముచ్చటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad