శుభ్రత, నాణ్యత పాటించాల్సిన హాస్టల్ నిర్వాహకులు నిబంధనలను ఏమాత్రం లెక్క చేయడం లేదు. తాజాగా నల్లగొండ లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ లోని లేడీస్ హాస్టల్ లో మధ్యాహ్నం భోజనంలో చనిపోయిన ఈగలు కనిపించిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -
లేడీస్ హాస్టల్ లో భోజనం చేస్తున్న విద్యార్థినీలు.. సగం తిన్న తర్వాత అందులో చనిపోయిన ఈగలను గుర్తించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని హాస్టల్ సిబ్బందికి తెలియజేసినా.. వారు తమకేం పట్టనట్లు వ్యవహరించారని అవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ హాస్టల్ ను విజిట్ చేసి ఓసారి ఇన్స్పెక్షన్ చేయాలని స్టూడెంట్స్ అంతా విజ్ఞప్తి చేస్తున్నారు.