Tuesday, September 17, 2024
HomeతెలంగాణGarla: విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఏఎన్ఎం బదిలీ

Garla: విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఏఎన్ఎం బదిలీ

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎన్ఎం ను వేరే చోటికి బదిలీ చేసినట్లు డాక్టర్ రాజ్ కుమార్ తెలిపారు. గార్ల మండల పరిధిలోని పెద్ద కిష్టాపురం సబ్ సెంటర్ లో పనిచేస్తున్న ఏఎన్ఎం లక్ష్మమ్మ విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో సీజన్ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటూ సబ్ సెంటర్ కు వచ్చే రోగులకు వైద్య సౌకర్యం అందటం లేదని, విధుల పట్ల ఏఎన్ఎం నిర్లక్ష్యం గ్రామీణ ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతుందని విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏఎన్ఎం లక్ష్మమ్మపై చర్యలు తీసుకొని ఇతర సిబ్బందిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అంజనాపురం గ్రామవాసి సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన డాక్టర్ రాజ్ కుమార్ ఏఎన్ఎంను వేరే చోటికి బదిలీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ముందస్తు అనుమతి లేకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది వివరాలు తమ దృష్టికి తీసుకువస్తే శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News