Tuesday, July 2, 2024
HomeతెలంగాణGodavarikhani: సేవ చేయటమే నా ప్రధాన లక్ష్యం: కార్పొరేటర్ కొమ్ము వేణు

Godavarikhani: సేవ చేయటమే నా ప్రధాన లక్ష్యం: కార్పొరేటర్ కొమ్ము వేణు

రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45 వ డివిజన్ లో కాలనీ వాసులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మట్టి పేరుకుపోయిందని కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే స్పందించి మున్సిపల్ సూపర్వైజర్ తెలియజేయడంతో వెంటనే సిబ్బంది డివిజన్ లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మట్టి తొలగించారు.

- Advertisement -


ఈ సందర్భంగా కార్పొరేట్ కొమ్ము వేణు మాట్లాడుతూ.రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సహాయ సహకారాలతో డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు. ఈ సందర్భంగా సహకరించినటువంటి డివిజన్ మున్సిపల్స్ సూపర్వైజర్ ఉమా మహేష్, మైనార్టీ జనరల్ సెక్రెటరీ గులాం ముస్తఫా, సిబ్బందికి డివిజన్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News