Sunday, July 7, 2024
HomeతెలంగాణHarish Rao: రైతులపట్ల కాంగ్రెస్ తన వ్యతిరేకతను చాటుకుంది

Harish Rao: రైతులపట్ల కాంగ్రెస్ తన వ్యతిరేకతను చాటుకుంది

రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ

రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటుకుందని మంత్రి హరీష్ రావు భగ్గుమన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని, 75 వేల కోట్లను రైతులకు రైతుబంధు ద్వారా అందించింది తమ ప్రభుత్వమే అని హరీష్ అన్నారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే… కేసీఆర్ రైతులకు డబ్బులు పంచారని, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పినా ఓట్లు వేయరని ఆయన జోస్యం చెప్పారు.

  • 69లక్షల రైతులు కేసీఆర్ కు అనుకూలంగా ఉన్నారని, పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా అపమంటారేమో అనిపిస్తోందన్నారు. రైతుల జోలికి వస్తే కబర్ధార్ అని హెచ్చరిస్తున్నానన్న ఆయన డిపాజిట్లు గల్లంతు చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, కర్ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్ లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని, కేసీఆర్ పాలనలో నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నామన్నారు.
  • రైతులపై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందని, రైతుబందు పొందిన 69లక్షల రైతులు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడతారని హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతు బందు కేసీఆర్ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ రైతులకు శత్రువుగా మారిందని హరీష్ అన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ వస్టే రైతు బందు రాం రాం… మూడు గంటల కరెంట్ మాత్రమేనంటూ ఆయన హెచ్చరించారు. 11 సార్లు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఒక్క పైసా ఇవ్వలేదు…. మాకు రెండు సార్లు అవకాశం ఇస్తే 11 సార్లు రైతు బంద్ ఇచ్చామన్నారు. మా అంటే ఒక నెల రోజులు కాంగ్రెస్ కుట్రలతో పథకాలు ఆగినా మళ్ళీ మేము రాగానే ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ కోసం ఎన్నికల సంఘానికి లేఖ రాశామని హరీష్ అన్నారు.
  • పటాన్చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News