Sunday, July 7, 2024
HomeతెలంగాణHarish Rao: తడిసిన వడ్లు సర్కారే కొనాలి

Harish Rao: తడిసిన వడ్లు సర్కారే కొనాలి

రైతుబంధు కింద ఎకరాకి 15,000 రూపాయలు ఎప్పడిస్తారు?

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు హరీష్. అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ మేము ప్రజల పక్షాన నిలబడతామని ఆయన వెల్లడించారు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందని, ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకొకండి మేము బోనస్ తో వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు 500 రూపాయల బోనస్ తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పండని ఆయన అన్నారు.

- Advertisement -

తుఫాన్ కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిసాయి. వాళ్ళను ఆదుకోవాలి..

మీరు అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకి 15,000 రూపాయలను
డిసెంబర్ 9వ ఇస్తామని చెప్పారు. ఎప్పుడు రైతు బంధు ఇస్తారో చెప్పండన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News