Thursday, April 10, 2025
HomeతెలంగాణHarish Rao: కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. ఖండించిన హరీష్ రావు

Harish Rao: కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. ఖండించిన హరీష్ రావు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదును ఖండిస్తున్నట్లు తెలిపారు. కేటీఆర్ పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. రాష్ట్రం బాగు కోసం పనిచేస్తే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. దమ్ముంటే ఫార్ములా వన్‌ రేస్‌(Formula One Race)పై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

కాగా ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిని చేర్చింది. కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో.. దీనిపై విచారణ చేయాలని సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News