Saturday, November 15, 2025
HomeతెలంగాణRed Alert Districts: ఈ జిల్లాల వారికి భారీ వర్ష సూచన, స్కూళ్లకు ఇప్పటికే సెలవులు..!

Red Alert Districts: ఈ జిల్లాల వారికి భారీ వర్ష సూచన, స్కూళ్లకు ఇప్పటికే సెలవులు..!

తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

జిల్లాల వారీగా అలర్ట్‌లు:

రెడ్ అలర్ట్ (అతి భారీ వర్షాలు): యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, వికారాబాద్.

ఆరెంజ్ అలర్ట్ (భారీ వర్షాలు): మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, ఆసిఫాబాద్.

ఎల్లో అలర్ట్ (మోస్తరు వర్షాలు): రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.

విద్యాసంస్థలకు సెలవు:

భారీ వర్షాల అంచనాల నేపథ్యంలో, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు గురువారం (ఆగస్టు 14, 2025) సెలవు ప్రకటించారు.

గత 24 గంటల్లో వర్షపాతం:

గత వారం రోజులుగా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లిలో 23.3 సెం.మీ., భీమినిలో 22.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

కుమురం భీం జిల్లా రెబ్బెనలో 22 సెం.మీ. వర్షం కురిసింది.హైదరాబాద్‌లోనూ బుధవారం భారీ వర్షం కురవడంతో మామిడిపల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎటువంటి అత్యవసర సహాయం కావాలన్నా స్థానిక అధికారులను సంప్రదించాల్సిందిగా కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad