Schools Holiday: శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు సెలవు రానుంది. మావోయిస్టులు రేపు అనగా జూన్ 20 వ తేదీన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టాల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ రెండు రాష్ట్రాల్లోని పలు చోట్ల వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎండాకాలం సెలవుల అనంతరం.. స్కూళ్లు మొదలైన దగ్గరినుంచి విద్యా సంస్థలకు ఆదివారాలు తప్ప ఈ క్రమంలో ఒక్కసారిగా బంద్ వార్త తెలియగానే వారంతా ఎగిరి గంతేస్తున్నారు. మరుసటి రోజు శనివారం కావడం తో లాంగ్ వీకెండ్ కు ప్లాన్ చేస్తున్నారు మరి కొంత మంది. అయితే ఈ బంద్ కు గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
బంద్ కు గల కారణం:
ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను అణిచి వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఓ ఆపరేషన్ ను మొదలు పెట్టింది. ఇందులో జరిగిన ఎన్ కౌంటర్ లో కొంత మంది మావోయిస్టు నాయకులు ఇప్పటికే ప్రాణాలు విడవగా.. మరికొందరు పరారవ్వగా ఇంకొంత మంది అరెస్ట్ అయ్యారు. దీంతో వెనక్కి తగ్గిన మావోయిస్టు నాయకులు ఎన్కౌంటర్ ను ఆపి వేసి తాము కేంద్రంతో చర్చలకు సిద్ధమనన్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎన్ కౌంటర్ ను ఆపలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టులు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు కేంద్రం చెక్ పోస్టుల భారీ భద్రత బలగాలను మోహరించింది. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో ఎక్కడ చూసినా చెకింగ్ లు జరుగుతున్నాయి. ప్రధాన రహదారుల వద్ద కూడా తనిఖీలు చేస్తున్నారు.