హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ హోటల్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను సూర్యాపేటకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.