Friday, September 20, 2024
HomeతెలంగాణHusnabad: వైభవంగా దశాబ్ది ఉత్సవాలు: సతీష్ కుమార్

Husnabad: వైభవంగా దశాబ్ది ఉత్సవాలు: సతీష్ కుమార్

పదేండ్ల జిల్లా ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. దక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజులపాటు నిర్వహించే కార్యక్రమంపై జిల్లా అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవంను పండుగ వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ వివరాలను అధికారులకు వివరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రతి మండలం, నియోజకవర్గం, జిల్లా వారిగా నిర్వహించే ఏర్పాట్లపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రతీ శాఖ పదేండ్ల ప్రగతి నివేదిక అభివృద్ధి పథకాలపై ప్లెక్సీ, సక్సెస్ స్టోరీ, ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు. మున్సిపాలిటీ, పల్లెలు, పట్టణాలలో, కార్యాలయాలలో, విద్యుత్ దీపాలను వెలిగించాలని ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సభలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీష్ రావు అన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News