Sunday, July 7, 2024
HomeతెలంగాణHusnabad: సతీష్ అన్నకే మా మద్దతు

Husnabad: సతీష్ అన్నకే మా మద్దతు

బీఆర్ఎస్ లో చేరిన స్థానికులు

సైదాపూర్ మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ నుండి పుట్ట శ్రీనివాస్, రాయిశెట్టి అజయ్, శ్రీకాంత్, మహేష్, రమేష్ తిరుపతి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్ యువకులు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచిందని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ ఒకప్పుడు మెట్ట ప్రాంతం అని కానీ, ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి చిరునామాగా మారిందని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితులై యువత బిఆర్ఎస్ పార్టీలో చేరడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దినదిన అభివృద్ధి చెందిందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని, మా బలం మా బలగం మా మద్దతు ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కే అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News