Tuesday, September 17, 2024
HomeతెలంగాణHuzurabad: ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలి

Huzurabad: ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలి

ఈటలను కలిసిన ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వినతి పత్రం అందజేసినట్లు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బోద్దుకూరి కిరణ్ కుమార్ తెలిపారు. హుజురాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భాజపా తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిసి బిజెపి ఎన్నికల మ్యానీ ఫెస్టోలో ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటు అంశం చేర్చి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని పత్రిక ముఖంగా ప్రకటించాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాస నవీన్, ప్రభాకర్ గుప్తా, శ్యాం ప్రసాద్, శ్రీకాంత్, గంగిశెట్టి రాజు, యంసాని శశిధర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News