Friday, October 18, 2024
HomeతెలంగాణHyd: కేటీఆర్ లీగల్ నోటీసులతో బండికి మైండ్..

Hyd: కేటీఆర్ లీగల్ నోటీసులతో బండికి మైండ్..

బండి సంజయ్ కథేమిటో కరీంనగర్ వాళ్లకు తెలుసంటూ ప్రభుత్వ విప్ లు భానుప్రసాద్, ప్రభాకర్ లు మండిపడ్డారు.  లీగల్ నోటీసుకు లీగల్ గా స్పందిస్తే ఓకే కానీ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకంటూ వీరిద్దరూ ప్రశ్నించారు. కేటీఆర్ r ఏం చేశారో తెలియదు కానీ బండి సంజయ్ కరీంనగర్ గుడి మెట్ల దగ్గర బిచ్చమెత్తుకున్నారంటూ వీరిద్దరూ దుయ్యబట్టారు.  కరీంనగర్ ప్రజలు మోస పోయారని, కేంద్రం నుంచి ఒక్క పైసా అయినా కరీంనగర్ అభివృద్ధికి సంజయ్ తెచ్చాడా అంటూ భానుప్రసాద్ నిలదీశారు.

- Advertisement -

రాష్ట్ర అభివృద్ధిలో బీ ఆర్ ఎస్ పాత్ర ఎంతో బీజేపీ పాత్ర ఎంతో తేల్చుకుందాం రా, బండి నాతో బహిరంగ చర్చకు రా అంటూ ప్రభాకర్ సవాలు చేశారు. అప్పటి విద్యార్థి ఉద్యమాలు వేరు.. ఇప్పటి ఉద్యమాలు వేరంటూ ఆయన వివరించారు. tspsc పేపర్ లీకేజీ పై బండి సంజయ్, రేవంత్ కుక్క తోక వంకర అనే రీతిలో మాట్లాడుతున్నారని, పిచ్చి కుక్కల్లా మొరగడం ప్రతిపక్ష నేతలు మానేయాలన్నారు. కేటీఆర్ లీగల్ నోటీసులతో బండి సంజయ్ మైండ్ బ్లాంక్ అయ్యిందని విప్ లు ఇద్దరూ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News