Sunday, July 7, 2024
HomeతెలంగాణHyd: బోన్ మారో చికిత్స కోసం గవర్నర్ ను కలిసిన బాధిత కుటుంబం

Hyd: బోన్ మారో చికిత్స కోసం గవర్నర్ ను కలిసిన బాధిత కుటుంబం

బోన్ మారో చికిత్స కోసం సాయం చేయాల్సిందిగా రోగి కుటుంబం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తౌడ నాగరాజు సుకన్య దంపతులు, వారి కూతురు అయిన తౌడ మైత్రిని గవర్నర్ దగ్గరికి ఉమ్మడి కొండపాక మండల బీజేపీ అధ్యక్షులు మన్నెం శశిధర్ రెడ్డి గవర్నర్ దగ్గరికి తీసుకువచ్చారు. మైత్రి ‘అప్లాస్టిక్ ఎనీమియా’ వ్యాధితో భాధపడుతోందని వారికీ ‘బోన్ మార్రో ట్రాన్సప్లాంటేషన్’ ఆపరేషన్ తమిళనాడులోని సిఎంసి హాస్పిటల్ లో చేపించాలని, అందుకుగాను ఒక్క ఆపరేషన్ కు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని గవర్నర్ కి తెలియజేశారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని శశిధర్తె రెడ్డి తెలిపారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చొరవతో తాము గవర్నర్ ను కలిసినట్టు వారు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News