Tuesday, September 17, 2024
HomeతెలంగాణHyd: ఆత్మీయ సమ్మేళనాలతో BRS శ్రేణుల్లో నయా జోష్

Hyd: ఆత్మీయ సమ్మేళనాలతో BRS శ్రేణుల్లో నయా జోష్

నగరంలో BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయని, నాయకులు, కార్యకర్తలలో నూతనోత్సాహం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సమ్మేళనాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని చెప్పారు. నగరంలోని అన్ని నియోజకవర్గాలలో డివిజన్ ల వారిగా సమ్మేళనాలు జరుగుతున్నాయని, మిగిలిన డివిజన్ లలో ఈ నెల 25 వ తేదీ లోగా పూర్తి చేస్తామన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మీ మీ నియోజకవర్గాలలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని, అనంతరం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

తెలంగాణ భవన్ లో మంత్రి తలసాని అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా BRS ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఇంచార్జి దాసోజు శ్రవణ్, మేయర్ విజయలక్ష్మి, MLC ప్రభాకర్ రావు, MLA లు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, కార్పొరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, విప్లవ్ కుమార్, రావుల శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, కంటోన్మెంట్ దివంగత MLA సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత, వివిధ నియోజకవర్గాల ఇంచార్జి లు ఆనంద్ గౌడ్, ప్రేమ్ సింగ్ రాథోడ్, ఆజం, సలా ఉద్దిన్ లోధి, శ్యాం సుందర్ రెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News