Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: ప్లీనరీ, ఆత్మీయ సమావేశాలపై తలసాని

Hyd: ప్లీనరీ, ఆత్మీయ సమావేశాలపై తలసాని

ఈ నెల 25 వ తేదీన అన్ని నియోజకవర్గాలలో నియోజకవర్గ స్థాయి BRS పార్టీ ఆత్మీయ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి తలసాని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో హోంమంత్రి మహమూద్ అలీ, జిల్లా ఇంచార్జి దాసోజు శ్రవణ్ కలిసి హైదరాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో కూడా అనేక నియోజకవర్గాలలో డివిజన్ స్థాయి సమ్మేళనాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మిగిలిన డివిజన్ లలో కూడా ఈ నెల 24 వ తేదీలోగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. 25 వ తేదీన నిర్వహించే నియోజకవర్గ సమ్మేళనాలకు నియోజకవర్గ పరిధిలోని MLC లు, కార్పోరేషన్ చైర్మన్ లు, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, కార్పొరేటర్ లుగా పోటీ చేసిన వారిని, డివిజన్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులను ఆహ్వానించాలని వివరించారు.

- Advertisement -

నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో పార్టీ పతాకాలను ఆవిష్కరించి సమావేశం వద్దకు రావాలని చెప్పారు. సమ్మేళనాల సందర్బంగా జెండాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని అన్నారు. సమావేశం నిర్వహణకు సంబంధించి సమగ్రమైన ఎజెండాను సిద్దం చేసుకోవాలని తెలిపారు. ఆయా నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి పనులను తెలియజెప్పే విధంగా నియోజకవర్గ ప్రగతి నివేదికను రూపొందించి ఆత్మీయ సమ్మేళనంలో వివరించాలని చెప్పారు.

ఈ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, MLC లు MS ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, స్టీఫెన్ సన్, MLA లు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కార్పోరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, రావుల శ్రీధర్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నియోజకవర్గ ఇంచార్జి లు ఆనంద్ గౌడ్, నందు బిలాల్, ఆజాం, సలా ఉద్దిన్ లోది, రాంరెడ్డి, జీవన్ సింగ్, బక్రీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News