Monday, May 13, 2024
HomeతెలంగాణHyd: దశాబ్ది ఉత్సవాల బాధ్యతలు స్వీకరించిన రసమయి

Hyd: దశాబ్ది ఉత్సవాల బాధ్యతలు స్వీకరించిన రసమయి

హైదరాబాద్ లోని డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన దశాబ్ది ఉత్సవాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వచ్చే నెల జూన్ 2 నుంచి 21 రోజుల పాటు సీఎం కేసీఆర్ సారథ్యంలో అత్యంత వైభవంగా జరిగే దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ప్రజాగాయకులు, రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ కు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్బంగా కవులు, కళాకారులు, మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్. పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News