Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: అష్టకాల నృసింహరామ శర్మ మరణం పట్ల కేసీఆర్ సంతాపం

Hyd: అష్టకాల నృసింహరామ శర్మ మరణం పట్ల కేసీఆర్ సంతాపం

సరస్వతీ పుత్రుడు, ప్రముఖ సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త, అష్టావధాని అష్టకాల నృసింహరామ శర్మ (80) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక సాహితీ వేత్తగా, ఆయా రంగాలకు రామశర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం అన్నారు. అష్టకాల గారి ఆధ్మాత్మిక సాహిత్య కృషి.. సిద్ధిపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపచేశాయంటూ కేసీఆర్ సంతాప సందేశం విడుదల చేశారు. ఈసందర్భంగా రామశర్మ వారితో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం కేసీఆర్ పై అద్భుతమైన కవిత రాసిన రామశర్మ కవిత చాలా ప్రఖ్యాతిగాంచింది కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News