Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: ముదిరాజ్ లకు తీరని అన్యాయంపై పోరాటం

Hyd: ముదిరాజ్ లకు తీరని అన్యాయంపై పోరాటం

ముదిరాజ్ లకు రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయనున్నట్లు ముదిరాజ్ చైతన్య వేదిక నాయకులు శివ ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28 న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ముదిరాజు చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అఖిల పక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమ నాయకురాలు, బీసి మహిళా నాయకురాలు ఇందిరా శోభన్, జాతీయ బీసి దల్ అధ్యక్షులు కుమార స్వామిని, బిజెపి రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్ లను ఆహ్వానించారు. ముదిరాజులకు రాజకీయంగా అన్యాయం జరిగిందని, తమ పార్టీ ద్వారా తమ ముదిరాజులకు న్యాయం చేస్తామని, ఈ సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తామని నేతలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట్ల పుస్పలత ముదిరాజ్, కురుమూర్తి ముదిరాజ్, ప్రదీప్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, బండి కృష్ణ ముదిరాజ్, కిరణ్ ముదిరాజ్, కార్తిక్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News