Thursday, September 19, 2024
HomeతెలంగాణHyd: సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థను ప్రశంసించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్

Hyd: సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థను ప్రశంసించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్

15 ఏళ్లుగా పర్యావరణం కోసం పాడుపడుతున్న సంస్థ

హైదరాబాదులో సనత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ కి మట్టి వినాయక విగ్రహం బహూకరించి, శాలువాతో సన్మానించారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. గత 15 సంవత్సరాలుగా పర్యావరణంపై సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ చేపట్టే కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆదిత్యకు వివరించారు. ఈనెల 18న జరుగనున్న గణేష్ నవరాత్రుల సందర్భంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలను ఆదిత్య ఐఏఎస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ WG ప్రసన్నకుమార్, ప్రకృతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆరేపల్లి రాజేంద్రప్రసాద్, టిపిసిబి ప్రాజెక్టు ఆఫీసర్ బి. నాగేశ్వరరావు, టిపిసిబి మీడియా కోఆర్డినేటర్ ఏ. సోమేశ్ కుమార్, సంకల్ప సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News