Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: విజయ రామారావు మృతి, సంతాపం తెలిపిన ప్రముఖులు

Hyd: విజయ రామారావు మృతి, సంతాపం తెలిపిన ప్రముఖులు

సీబీఐ డైరెక్టర్ గా, మాజీ మంత్రిగా పనిచేసిన విజయరామారావు మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సిబిఐ డైరెక్టర్ గా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా విజయ రామారావు విశేష సేవలు అందించారని ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్నారు.

- Advertisement -

వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ప్రాంతానికి చెందిన విజయ రామారావు తొలి తరం ఐపీఎస్ అధికారిగా నిలిచిన వారిలో ఒకరు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఈయనకు ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది.
ఉద్యోగ పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లో చేరి మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో సేవలు అందించిన విజయ రామారావు మొదట టీడీపీలో ఆతరువాత టీఆర్ఎస్ లో చేరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News