Saturday, November 15, 2025
HomeతెలంగాణGovt Seized Hydra lands: శంషాబాద్‌లో రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం...

Govt Seized Hydra lands: శంషాబాద్‌లో రూ. 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా..!

Telangana govt Seized Hydra lands: రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడటానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా, నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకునే బాధ్యతను హైడ్రా (హైదరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ)కు అప్పగించింది. ఈ క్రమంలో, హైడ్రా రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, శాతంరాయ్ గ్రామంలోని సర్వే నంబర్ 17లో ఉన్న రూ. 500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది.
గతంలో ఈ భూమిని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డుకు ప్రభుత్వం కేటాయించింది. అయితే, కొందరు స్థానిక నాయకులు, అనీష్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ ఈ భూమి తమదని పేర్కొంటూ కబ్జా చేశారు. స్థానికులు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.
స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి, కబ్జాదారుల నిర్మాణాలు, ప్రహరీని తొలగించింది. స్వాధీనం చేసుకున్న భూమిలో ఉన్న నివాసాలు, దేవాలయం, మసీదులను సురక్షితంగా ఉంచి మిగతా భూమిని కాపాడింది. ఈ భూమి ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉందని తెలిపే బోర్డును అక్కడ ఏర్పాటు చేసింది. అనీష్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు చెందిన శ్రీపాద దేశ్‌పాండేపై కూడా పలు భూ వివాదాలకు సంబంధించి ఫిర్యాదులు అందినట్లు హైడ్రా తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad