Monday, November 17, 2025
HomeతెలంగాణIbrahimpatnam: బల్మూరు వెంకట్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

Ibrahimpatnam: బల్మూరు వెంకట్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు

బల్మూరికి సన్మానం

విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ ని గురునానక్ కాలేజ్ వద్ద అరెస్టు చేసి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం స్థానిక విద్యార్థి నాయకుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు & ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఆదిభట్ల పోలీస్ ఉన్నత అధికారులతో మాట్లాడిన అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ఆదిభట్లలోని మర్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్, నియోజకవర్గం నాయకులు నందకిషోర్, వినయ్ పటేల్, సోహెల్, కార్తీక్ లను సన్మానించారు కాంగ్రెస్ నాయకులు ఎంఎన్ఆర్ యువసేన ప్రెసిడెంట్ టేకుల కమలాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బాలశివుడు గౌడ్, ఎన్ఎస్యూఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad