Friday, September 20, 2024
HomeతెలంగాణIllandukunta: ఓటరు నమోదును పకడ్బందీగా నిర్వహించాలి

Illandukunta: ఓటరు నమోదును పకడ్బందీగా నిర్వహించాలి

ఓటరు నమోదు ప్రక్రియను బూత్ లెవెల్ అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని తహసిల్దార్ ఠాకూర్ మాధవి అన్నారు. ఇల్లందకుంట తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం బూత్ లెవల్ స్థాయి అధికారులతో తహశీల్దార్ ఠాకూర్ మాధవి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా చేర్పులు, మార్పులు, తొలగింపు జాబితాతో పాటు 100 సంవత్సరములు పై బడిన వయసు వారిని గుర్తించి వారి వివరములను పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News