Saturday, July 27, 2024
HomeతెలంగాణHuzurabad: కాంగ్రెస్సే ప్రజలకు శ్రీరామరక్ష

Huzurabad: కాంగ్రెస్సే ప్రజలకు శ్రీరామరక్ష

కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి

ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందుతుందని, ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్నారెడ్డి అన్నారు. వీణవంక మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వొడితల ప్రణవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది యువత బలిదానాలు చేసుకోగా స్పందించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని కావాలన్నా ఆకాంక్షకు తిలోదకాలిస్తూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వొడితల ప్రణవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేసి తీరుతుందని కాంగ్రెస్ మాట ఇస్తే వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News