Friday, September 20, 2024
HomeతెలంగాణSirisilla: అయోధ్య శ్రీ రామ పూజిత అక్షింతలకు అవమానం

Sirisilla: అయోధ్య శ్రీ రామ పూజిత అక్షింతలకు అవమానం

మా సెంటిమెంట్లను బాధించారంటున్న స్థానికులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రంలో అయోధ్య శ్రీ రామ పూజిత అక్షింతలకు అవమానం జరిగింది. మంగళవారం తంగళ్ళపల్లిలో రామాలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలతో కలిసి మండల కేంద్రంలో పూజిత అక్షింతలను పుర వీధుల్లో తిరుగుతూ గ్రామ ప్రజలకు పంచారు. కాగా పేపర్లలో పడాలనే అత్యుత్సాహంతో అయోధ్య శ్రీ రామ పూజిత అక్షింతలను మాజీ జెడ్పీటీసీ, తంగళ్ళపల్లి మండలం ఎంపీటీసీ కోడి అంతయ్య ఎంతో భక్తి, శ్రద్ధ, నియమాలతో ఎత్తుకోవాల్సిన పూజిత అక్షింతలను పాదరక్షలు (బూట్లు) వేసుకొని ఎత్తుకొని హిందూ సంప్రదాయాన్ని అవమానపరచాడని గ్రామ ప్రజలు అన్నారు. అంతయ్య హిందువాదినని చెప్పుకోవడమే తప్ప ఏమీ లేదని, ఫోటోల ఫోజులకే అని, అయోధ్య నుండి వచ్చిన పూజిత అక్షింతలను పాదరక్షలు ధరించి ఎత్తుకోవడం తప్పు అని గ్రామ ప్రజలు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News