Saturday, October 5, 2024
HomeతెలంగాణSuryapet: సైదిరెడ్డి జోరుగా ప్రచారం

Suryapet: సైదిరెడ్డి జోరుగా ప్రచారం

నేరేడుచర్లలో పలు గ్రామాల్లో ప్రచారం

ఎప్పుడో ఒకసారి కనపడే వారు కావాలా ఎప్పుడూ జనం మధ్య ఉండే నేను కావాలా ఆలోచించి ఓటు వేయాలని హుజూర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, శంకరమ్మతో కలిసి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో గ్రామాలన్ని జన సంద్రోహంగా మారాయి. సైదిరెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామంలోని భృగు మాలిక సోమప్ప సోమేశ్వర దేవాలయంలో సైదిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామాల్లో భారీ ర్యాలీగా ప్రచారం నిర్వహించి, మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లలో హుజూర్ నగర్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. మళ్లీ బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ప్రజలందరికీ మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

- Advertisement -

అభివృద్ధి వైపు ఉంటారా అభివృద్ధి నిరోధకుల వైపు ఉంటారా ఆలోచించాలి అన్నారు. 24 గంటల కరెంట్ వస్తుంది.బోర్లు,బావులు చెరువులు నిండినవని, ఎకరానికి 40 బస్తాలు వడ్లు పండుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కారు గుర్తుకు ఓటేసి హుజుర్ నగర్ లో మరింత అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిద్దామని అన్నారు. మాయ మాటలు విని మోసపోవద్దని అభివృద్ధి చేసే వారికే తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News