Saturday, October 5, 2024
HomeతెలంగాణThangallapalli: బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిక

Thangallapalli: బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిక

కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో..

బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ వార్డు సభ్యులు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డం మధుకర్ (చోటు) ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ గ్రామం నుండి మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్, సామల సరస్వతి-సత్యనారాయణ, కారంపూరి కమల బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజక వర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే వారికి కండువా కప్పి సాధనంగా ఆహ్వానించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పుర్మాని మంజుల లింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాలగం ప్రవీణ్ (టోనీ), మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు హారిక, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, మల్లేష్ యాదవ్, గోరింటల రాజమల్లు, జంగంపల్లి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News