Sunday, November 16, 2025
HomeTop StoriesShirdi : షిర్డీ టూర్ స్పెషల్ ప్యాకేజీ..హైదరాబాద్ నుంచే..

Shirdi : షిర్డీ టూర్ స్పెషల్ ప్యాకేజీ..హైదరాబాద్ నుంచే..

Indian Railway: షిర్డీ సాయిబాబా భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే షిర్డీ యాత్రను పూర్తి చేసుకునేలా “సాయి సన్నిధి” పేరుతో ఈ ప్యాకేజీని రూపొందించారు.

- Advertisement -

ప్యాకేజీ ముఖ్యాంశాలు
ఈ ప్యాకేజీ ప్రతి బుధవారం హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. నాగర్‌సోల్, మేడ్చల్‌, నిజామాబాద్, బాసర, కామారెడ్డి, మల్కాజ్‌గిరి స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటుంది. ఈ టూర్‌లో రైలు ప్రయాణానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి:

కంఫర్ట్ ప్యాకేజీ: ఇందులో థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ వాహనం, వసతి మరియు బ్రేక్‌ఫాస్ట్‌ లాంటి సదుపాయాలు ఉంటాయి.

స్టాండర్డ్ ప్యాకేజీ: ఇందులో స్లీపర్ క్లాస్ ప్రయాణం, ఏసీ వాహనం, వసతి మరియు బ్రేక్‌ఫాస్ట్‌ లాంటి సదుపాయాలు ఉంటాయి.

ప్యాకేజీలో ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు కూడా కవర్ అవుతాయి.

యాత్ర వివరాలు
బుధవారం: సాయంత్రం 6.40 గంటలకు 17064 నంబరు అజంతా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.

గురువారం: ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో హోటల్‌కు తీసుకెళ్తారు. విశ్రాంతి అనంతరం షిర్డీ సాయిబాబా దర్శనానికి బయలుదేరుతారు. గమనిక: ఆలయ దర్శన టికెట్ ప్యాకేజీలో భాగం కాదు, దానిని ప్రయాణికులే సొంతంగా కొనుగోలు చేసుకోవాలి. దర్శనం తర్వాత తిరిగి హోటల్‌కు వచ్చి విశ్రాంతి తీసుకుని, సాయంత్రం 5 గంటలకు చెక్ అవుట్ చేసి, నాగర్‌సోల్ రైల్వేస్టేషన్‌కు బయలుదేరుతారు. రాత్రి 8.30 గంటలకు 17063 నంబరు రైలులో తిరిగి ప్రయాణం మొదలవుతుంది.

CM Chandrababu : ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌.. హెక్టారుకు రూ. 50 వేలు సాయం

శుక్రవారం: ఉదయం 9.45 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ధరల వివరాలు
కంఫర్ట్ ప్యాకేజీ (థర్డ్ ఏసీ):

సింగిల్ షేరింగ్: రూ. 7,890

డబుల్ షేరింగ్: రూ. 6,660

ట్రిపుల్ షేరింగ్: రూ. 6,640

పిల్లలకు (5-11 ఏళ్లు): బెడ్‌తో రూ. 5,730, బెడ్ లేకుండా రూ. 5,420

స్టాండర్డ్ ప్యాకేజీ (స్లీపర్ క్లాస్):

సింగిల్ షేరింగ్: రూ. 6,220

డబుల్ షేరింగ్: రూ. 4,980

ట్రిపుల్ షేరింగ్: రూ. 4,960

పిల్లలకు (5-11 ఏళ్లు): బెడ్‌తో రూ. 4,060, బెడ్ లేకుండా రూ. 3,750

సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 12 వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలు మరియు బుకింగ్ కోసం IRCTC వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఈ ప్యాకేజీ ద్వారా సాయిబాబా దర్శనం సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad