Thursday, September 19, 2024
HomeతెలంగాణJadcharla: నూతన కమిటీని ఏర్పాటు చేసి దేవాలయాన్ని అభివృద్ధి చేద్దాం

Jadcharla: నూతన కమిటీని ఏర్పాటు చేసి దేవాలయాన్ని అభివృద్ధి చేద్దాం

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి పెద్దగుట్టపై ఉన్న శ్రీ రంగనాయక స్వామి దేవాలయానికి అధికారికంగా నూతన కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామిని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని తెలిపారు. శ్రీ రంగనాయక స్వామి దేవాలయానికి వెయ్యి ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, ఎంతో విశిష్టత కలిగిన పురాతనమైన దేవాలయానికి అన్ని సౌకర్యాలను కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అన్నారు. నియోజకవర్గంలో పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యతనీ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దేవాలయ అభివృద్ధి పనులకు నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు.

నియోజకవర్గంలోని ఊర్కొండ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని, గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాల్వ రాంరెడ్డి దంపతులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News