Thursday, July 4, 2024
HomeతెలంగాణJadcharla: పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన దార్శనీయులు రామోజీ రావు

Jadcharla: పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన దార్శనీయులు రామోజీ రావు

జడ్చర్లలో రామోజీ రావుకు ఘన నివాళులు

తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగి, దేశ పత్రిక రంగంలో ఓ కొత్త వరవడిని సృష్టించిన దార్శనీయులు ఈనాడు వ్యవస్థాపకులు రామోజీరావు అని జడ్చర్ల జర్నలిస్టులు కొనియాడారు. ఈనాడు గ్రూప్ అధినేత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల జడ్చర్ల అంబేద్కర్ చౌరస్తాలో రామోజీరావు చిత్రపటానికి జర్నలిస్టులు నివాళులర్పించారు. ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన రామోజీరావు అసామాన్య విజయాలు సాధించి ఈనాడు పత్రిక, రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు వారి ఘనతను చాటాడని గుర్తు చేశారు. యావత్ ప్రపంచానికి తెలుగు శక్తిని చాటి చెప్పిన రామోజీరావు చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కార్యక్రమంలో జడ్చర్ల జర్నలిస్ట్ జేఏసీ గౌరవ అధ్యక్షులు బాద్మి రవి శంకర్, జర్నలిస్టులు మోయిజ్, కృష్ణ, గోనెల నరేందర్, శేఖర్, నరేందర్ గౌడ్, డేవిడ్, వేణు, జమీర్, శేఖర్, నరసింహారెడ్డి, సతీష్ రెడ్డి, ముస్తఫా, అబ్దుల్లా, రాఘవేందర్, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News