Friday, September 20, 2024
HomeతెలంగాణJanagama: అధికారులను అభినందించిన ఎర్రబెల్లి

Janagama: అధికారులను అభినందించిన ఎర్రబెల్లి

ఢిల్లీలో జరిగిన పంచాయత్ రాజ్ జాతీయ అవార్డులు ప్రదాన ఉత్సవంలో తెలంగాణ సాధించిన 13 అవార్డులను, భారత రాష్ట్రపతి చేతుల మీదుగా, మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో ఆయా గ్రామాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు అందుకున్నారు. అవార్డులు స్వీకరించి, ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి. ఇదే సమయంలో జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామం సమృద్ధిగా మంచి నీరు ఉన్న విభాగంలో దేశంలో నెంబర్ వన్ గా నిలవడం పట్ల, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ లను మంత్రి అభినందించి, సత్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News