Monday, November 17, 2025
HomeతెలంగాణKale Yadayya: కేటీఆర్ ని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

Kale Yadayya: కేటీఆర్ ని కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే

అప్పా జంక్షన్ నుండి చేవెళ్ల వరకు మెట్రో లైన్ విస్తరించాలని డిమాండ్

హైదరాబాద్ లోని మెట్రో భవన్ లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. అప్పా జంక్షన్ నుండి చేవెళ్ల వరకు మెట్రో లైన్ విస్తరింప చేయాలని కేటీఆర్ ను కోరారు యాదయ్య. చేవెళ్ల, మొయినాబాద్ మండలాలకు రైలు సౌకర్యం లేనందున ఇక్కడి ప్రజలు, రైతులు దశాబ్దాలుగా ఇబ్బంది పడ్డారని, మెట్రో విస్తరణ శంషాబాద్ వరకు విస్తరిస్తున్నారని.. కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో కాలే యాదయ్య మెట్రో స్టేషన్ మొయినాబాద్ ను కలుపుతూ చేవెళ్ల వరకూ విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాలని కేటీఆర్ ని ఎమ్మెల్యే యాదన్న కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad