Tuesday, July 2, 2024
HomeతెలంగాణKalyanadurgam: రైతు దినోత్సవంలో జగన్

Kalyanadurgam: రైతు దినోత్సవంలో జగన్

1,117 కోట్ల బీమా పరిహారం విడుదల చేసిన సీఎం జగన్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్ రైతు దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల ఖాతాల్లో పంట బీమా పరిహారం జమచేస్తున్నామన్నారు.  ఖరీఫ్ పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం విడుదల చేసిన సీఎం జగన్, ఇందుకు 1,117 కోట్లు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు.  సుమారు 10 లక్షల మంది రైతులు దీంతో లాభపడతారని సీఎం తెలిపారు.  విత్తనం నాటిన దగ్గరినుంచి పంట అమ్మేవరకు రైతుకు వెన్నంటి రాష్ట్ర ప్రభుత్వం ఉందని జగన్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News