Sunday, November 16, 2025
HomeతెలంగాణKarimnagar: ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన

Karimnagar: ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన

మహాశివరాత్రి పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రామచంద్రాపూర్ కాలనీలోని సాయిబాబా ఆలయం వద్ద ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన ఏర్పాటయింది. హోలోగ్రాం శివలింగ ప్రదర్శన, త్రీడీ ఫ్లోర్ ఆర్ట్, సహస్ర దీపాలంకరణ స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శన 18, 19 తేదీలలో కూడా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి 9 గంటల వరకు భక్తులు ప్రదర్శనలు తిలకించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad