Saturday, July 27, 2024
HomeతెలంగాణKarimnagar: అట్టహాసంగా వెలిచాల నామినేషన్

Karimnagar: అట్టహాసంగా వెలిచాల నామినేషన్

భారీ బలగంతో ఊరేగింపు

కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమం..

- Advertisement -

నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మేల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, వొడితల ప్రణవ్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, కరీంనగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ పురిమల్ల శ్రీనివాస్ ఇతర ముఖ్య నేతలు.

నామినేషన్ కార్యక్రమానికి భారీగా హాజరైన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు…డప్పు చప్పుళ్ళు, కళాకారుల ఆటపాటలతో నామినేషన్ ర్యాలికి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రతిమ సెంటర్లో వెలిచాల రాజేందర్ రావు అభిమానులు భారీ గజమాలతో ఎంపీ అభ్యర్థిని సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్, కరీంనగర్ నియోజకవర్గ ఇంచార్జ్ పురమల శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు కొండూరు సత్యనారాయణ గౌడ్, ఆరేపల్లి మోహన్ తో పాటు అన్ని మండలాల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News