Thursday, September 19, 2024
HomeతెలంగాణKaudipally: ధరణి పేరుతో సర్కారు దగా

Kaudipally: ధరణి పేరుతో సర్కారు దగా

గత 8 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అరికట్టేందుకే ప్రజా ఘోష బీజేపీ భరోసా కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన ప్రజా గోషా బీజేపీ భరోస కార్నర్ సమావేశానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ ధరణి పేరుతో బి ఆర్ ఎస్ నాయకులు రైతులను దగా చేస్తున్నారన్నారు. వందల ఎకరాల భూములను బి ఆర్ఎస్ నాయకుల పేరుపై మార్చుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.. బి ఆర్ఎస్ పాలన ప్రారంభమై ఎనిమిది సంవత్సరాలు గడిచినప్పటికీ తిమ్మాపూర్ రోడ్డు గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఆ ఇంటిలో వచ్చే పెన్షన్ తొలగిస్తున్నారన్నారు. భార్యకు ఉంటే భర్తకు లేదని, ఇంట్లో ఒకే పెన్షన్ ఇచ్చి భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News