Monday, September 16, 2024
HomeతెలంగాణKavvampalli: పేదల కలలు నెరవేర్చేది కాంగ్రెస్

Kavvampalli: పేదల కలలు నెరవేర్చేది కాంగ్రెస్

ఓడిపోతాననే భయంతో రసమయి అనుచిత వాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదల కలలు నెరవేరుతాయని, రాష్ట్ర ప్రజలందరికి సంక్షేమ పథకాల ఫలాలందుతాయని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. బెజ్జంకి మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామంలో కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించగా, గ్రామ కాంగ్రెస్ నాయకులు డప్పుచప్పుల్లతో ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు.బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను నాయకులు బడుగుబలహీన వర్గాల ప్రజలకు అందలేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్హులైన వారందరికి ఆరు గ్యారంటీ పథకాలను అందిస్తుందన్నారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, పార్టీ మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి, జనాగం శంకర్, మంకాల ప్రవీన్, చెప్యాల శ్రీనివాస్, రావుల నర్సయ్య, అక్కరవేణి పోచయ్య, మామిడాల జయరాం, నాయకులు మానాల రవి, దోనే వెంకటేశ్వర్ రావు, జెల్లా ప్రభాకర్ అయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు.బేగంపేట గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన ఎన్నికల ప్రచారంలో స్థానిక ఎంపీటీసీ పోతిరెడ్డి స్రవంతి భర్త కాంగ్రెస్ నాయకుడు పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డిపై చేసిన అనుచిత వాఖ్యలను కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం ఖండించారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News