Friday, September 20, 2024
HomeతెలంగాణVemula: భారతదేశానికి త్వరలో కేసిఆర్ నాయకత్వం

Vemula: భారతదేశానికి త్వరలో కేసిఆర్ నాయకత్వం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

- Advertisement -

గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మంత్రి వేముల ప్రసంగించారు.  బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. కేసీఆర్ ఎప్పుడూ పార్టీ కార్యకర్తలను విస్మరించ లేదనీ, కష్టపడ్డ వారిని కడుపులో పెట్టి చూసుకుంటాడన్నారు. అందరు కలిసి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా సురేందర్ మరోసారి ఆశీర్వదించి దీవించాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు నరేంద్ర మోడీ అని మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి.

 మోడీ అవినీతి, అక్రమాలను అంతమొందించే వరకు కేసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పోరాటం ఆగదని, నరేంద్ర మోడీని దించుడు ఖాయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఇచ్చుడు ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News