Thursday, September 19, 2024
HomeతెలంగాణKhammam: ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల

Khammam: ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల

అరాచక శక్తులతో భద్రత కరువైంది

ఖమ్మం పట్టణంలోని శ్రీరామ్ హిల్స్ లో, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల విజయని ఆకాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మాజీ మంత్రి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ.. నా ప్రవర్తన చూసినటువంటి మీరు, నా రాజకీయ విధానాన్ని చూసిన మీరు, నివాసయోగ్యంగా ఉండేటువంటి ఖమ్మాన్ని చూశారు. నేడు ఖమ్మంలో ఉండాలంటేనే అరాచకమని దుస్థితికి తీసుకొచ్చారు అది బాధాకరమని తుమ్మల అన్నారు. ఎంత పెద్ద కాలనీ అయినా జీవనాధారమైన మంచినీటి సౌకర్యం లేకపోతే నిరుపయోగమే, అరాచక శక్తులకు దూరంగా ఉంటే ఖమ్మం వాతావరణం బాగుంటుందన్నారు. ఈ ఎన్నికలలో చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మానుకొండ రాధా కిషోర్, పట్టణ అధ్యక్షులు జావిద్, కమ్మర్త మురళితో పాటు పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News