Saturday, September 28, 2024
HomeతెలంగాణKhammam: జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 50 శాతం రాయితీ

Khammam: జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 50 శాతం రాయితీ

అన్ని స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసిన డీఈవో

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే -ఐజేయు) ఖమ్మం జిల్లా కమిటీ ప్రాతినిధ్యం మేరకు ఖమ్మం జిల్లాలో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు తన కార్యాలయంలో సర్క్యులర్ కాపిని టియూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం జిల్లా కమిటీ బాధ్యులకు అందజేశారు. సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని తమ యూనియన్ చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన డీఈవో వెంటనే సర్క్యులర్ జారీ చేస్తూ అన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు, ప్రైవేట్ పాఠశాల యజమానుల సంఘానికి, మండల విద్యాశాఖ అధికారులకు పంపించారని, కావున జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే ఐజేయు నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు వై మాధవరావు జనార్ధన చారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News