Thursday, September 19, 2024
HomeతెలంగాణKhammam: కేసీఆర్, వేములకు థాంక్స్ చెప్పిన సండ్ర

Khammam: కేసీఆర్, వేములకు థాంక్స్ చెప్పిన సండ్ర

సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు మండలాల్లో R&B రోడ్లకు 15 కోట్ల 20 లక్షల రూపాయలు, సత్తుపల్లి నుండి వెంకటాపురం రోడ్ (మర్లపాడు) వయా సిద్ధారం, సదాశివునిపేట R&B డబుల్ లైన్ రోడ్డుకు 27 కోట్ల రూపాయలు మంజూరయింది. రోడ్ల మంజూరు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే సండ్ర. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో 43 కోట్ల రూపాయల R&B రోడ్ల మంజూరు పట్ల ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కి, రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 43 కోట్ల రూపాయల R&B రోడ్ల మంజూరు పత్రాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదిగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అందుకుని ధన్యవాదాలు తెలిపారు. పలుమార్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని కలిసి నియోజకవర్గంలో R&B రోడ్లు మంజూరు చేయాలని కోరగా 4 కోట్ల 70 లక్షల రూపాయలతో చిన్న కోరుకోండి, ఆర్లపాడు రోడ్డు , 5 కోట్ల 50 లక్షల రూపాయలతో తల్లాడ నుండి కొడవటిమెట్ట వయా నారాయణపురం రోడ్డు, 5 కోట్ల రూపాయలతో కలకోడిమ, వెంకటాపురం వయా బసవపురం రోడ్డు, అదేవిధంగా సత్తుపల్లి నుండి వెంకటాపురం రోడ్ (మర్లపాడు) కు వయా సిద్ధారం సదాశివునిపేట గ్రామాల రోడ్డుకు క్రితం 12 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు అవ్వగా ప్రజా రవాణా దృష్ట్యా డబుల్ లైన్ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని కోరగా 27 కోట్లు రూపాయలతో డబుల్ లైన్ రోడ్డు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News