Monday, November 17, 2025
HomeతెలంగాణKodimyala: ఆడబిడ్డ కట్నంగా కళ్యాణ లక్ష్మి

Kodimyala: ఆడబిడ్డ కట్నంగా కళ్యాణ లక్ష్మి

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూర్ అనుబంధ గ్రామమైన ఆరేపల్లి లో శుక్రవారం ఇద్దరు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అందజేశారు. చెక్కుతో‌ పాటుగా చీర, జూట్‌ బ్యాగ్ ను పెళ్లి కూతురు తల్లి దండ్రులకు కానుకగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ… పేదింటి ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కాకూడదని. సదుద్దేశంతో కేసీఆర్ మేనమామ గా ఆడబిడ్డకు కట్నంగా ఒక లక్ష 116/- రూపాయలను కట్నంగా అందజేస్తున్న దేశంలో ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.
వారి వెంట సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు, సింగిల్ విండో చైర్మన్ లు మేనేని రాజనర్సింగారావు,బండ‌ రవీందర్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ కోరండ్ల‌ నరేందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, భా రా స మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, ఆర్ బి ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేశం, వివిధ గ్రామాల సర్పంచులు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad