Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR: మోడీ గారు.. కమలం నేతలు రేవంత్ మీద ఈగ వాలనివ్వడం లేదు: కేటీఆర్

KTR: మోడీ గారు.. కమలం నేతలు రేవంత్ మీద ఈగ వాలనివ్వడం లేదు: కేటీఆర్

- Advertisement -

KTR| తెలంగాణలోని కమలం నేతలు సీఎం రేవంత్ రెడ్డి మీద ఈగ వాలనివ్వకుండా కాపాడుతున్నారంటూ ప్రధాని మోదీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు మోడీతో కలిసిన సమయంలో రాష్ట్రంలో కమలం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు.

“మోడీ గారూ.. కలిసికట్టుగానే పని చేస్తున్నారు మీ కమలం నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసిపోయి మరీ పని చేస్తున్నారు. చోటేభాయ్ కు వ్యూహకర్తగా… కాంగ్రెస్ కట్టర్ కార్యకర్తలుగా.. విశ్రమించకుండా పని చేస్తున్నారు. చీకటి రాజకీయ ప్రయోజనాల కోసం ‘చేతి’ కలుపుతూ చోటే భాయ్ కోసం కలిసి పని చేస్తున్నారు. ఎన్ని అరాచకాలు జరిగినా ఒక్కరూ నోరుమెదపరు! రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటారు! హైడ్రా మంచిదంటారు, మూసి కావాలంటారు, ఏమన్నా అంటే నిద్ర నటిస్తారు! పిల్లలు చనిపోయినా, రైతు గుండె పగిలినా, గిరిజనులను చెరపట్టినా, చప్పట్లు కొడతారు! తెలంగాణలో వారి చేతిలోనే కమలం ఉంది. జాగ్రత్తగా.. భద్రంగా..!” అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad