Monday, November 17, 2025
HomeతెలంగాణKTR: బలగం మొగిలయ్య మృతి పట్ల కేటీఆర్ తీవ్ర సంతాపం

KTR: బలగం మొగిలయ్య మృతి పట్ల కేటీఆర్ తీవ్ర సంతాపం

ప్రముఖ తెలంగాణ‌ జానపద కళాకారుడు బలగం మొగిలయ్య(Balagam Mogilaiah) మృతిపట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) సంతాపం తెలిపారు. మొగిలయ్య‌ మరణించినా పాట రూపంలో బతికే ఉంటార‌ని తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

‘నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు చలించని హృదయం లేదు. నీ పాట ద్వారా తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించావ్. మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను మళ్లీ గుర్తు చేశావ్. మొగులన్నా..నీ పాట తెలంగాణ బలగాన్ని మళ్లీ చాటింది. మానవీయకోణాన్ని ఆకాశమంత ఎత్తులో నిలిపింది. మొగులయ్య గారు మరణించినా పాట రూపంలో బతికే ఉంటారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి’ అంటూ పేర్కొన్నారు.

కాగా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్య వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad