Thursday, February 20, 2025
HomeతెలంగాణKTR: ఏపీ కృష్ణా జలాలు తరలిస్తోంటే కాంగ్రెస్‌ చోద్యం చూస్తోంది: కేటీఆర్‌

KTR: ఏపీ కృష్ణా జలాలు తరలిస్తోంటే కాంగ్రెస్‌ చోద్యం చూస్తోంది: కేటీఆర్‌

ఏపీ ఇష్టారాజ్యం యథేచ్చగా కృష్ణా జలాల తరలిస్తోంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“కాంగ్రెస్ చోద్యం.. ఏపీ ఇష్టారాజ్యం-యథేచ్చగా కృష్ణా జలాల తరలింపు‌‌.. కృష్ణా జలాల నుండి ఏపీ ఇప్పటికే 646టీఎంసీలు వినియోగం. సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడునెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాల తరలింపు.. అయినప్పటికీ నిలువరించని కాంగ్రెస్ సర్కార్. నది జలాలను ఆంధ్రప్రదేశ్ తన్నుకు పోతున్నా చలనం లేని బోర్డు-నోరెత్తని రేవంత్ సర్కారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టును బొట్టును కాపాడుతూ బీడు భూములను కేసీఆర్ గారు సస్యశ్యామలం చేస్తే-ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టింది.

నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో-ఒక్కొక్కొటిగా అన్నింటిని గంగలో కలుపుతుంది కాంగ్రెస్. వచ్చేది వేసవి తాగునీళ్లకు, సాగు నీళ్లకు కష్టం అని తెలిసి కూడా గాలిమోటర్లో ఢిల్లీ ట్రిప్పులు కొడ్తున్న ముఖ్యమంత్రికి అన్నదాతల గోస ఏం తెలుసు. కేఆర్ఎంబి పరిధిలోని త్రీ మెన్ కమిటీ దిక్కులేదు-సాగర్,శ్రీశైలం లో నీళ్లు అడుగంటి పొలాలు ఎండుతున్నా నీమ్మకు నీరెత్తినట్టున్న కాంగ్రెస్” అని కేటీఆర్ విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News